ఏర్పేడు పున్నమి న్యూస్, ఫిబ్రవరి 26: ఏర్పేడు మండలం చిందేపల్లి గ్రామంలో గురువారం నాడు రక్తదాన శిబిరం నిరావహించారు. స్థానిక శ్రీ ద్రాక్షాయని, పార్వతీ సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త డాక్టర్ గంగలపూడి గిరిధర్ రెడ్డి అధ్యక్షతన ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తిరుపతికి చెందిన రక్షణ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు ఈ శిబిరంలో పాల్గొని రక్తాన్ని సేకరించారు. గ్రామానికి చెందిన సుమారు 35 మంది యువకులు, పెద్దలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ముఖ్యంగా చిందేపల్లి గ్రామం నుండి తిరుపతిలోని ఎస్జీఎస్ కళాశాలకు వెళ్లి చదువుకుంటున్న విద్యార్థులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని సామాజిక బాధ్యతను చాటుకున్నారు. ప్రాణాపాయంలో ఉన్న వారిని ఆదుకోవడానికి రక్తదానం ఎంతో మేలు చేస్తుందని, ఈ శిబిరానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

రక్తదాన శిబిరంలో సామాజిక బాధ్యత చాటుకున్న చిందేపల్లిగ్రామస్తులు
ఏర్పేడు పున్నమి న్యూస్, ఫిబ్రవరి 26: ఏర్పేడు మండలం చిందేపల్లి గ్రామంలో గురువారం నాడు రక్తదాన శిబిరం నిరావహించారు. స్థానిక శ్రీ ద్రాక్షాయని, పార్వతీ సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త డాక్టర్ గంగలపూడి గిరిధర్ రెడ్డి అధ్యక్షతన ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తిరుపతికి చెందిన రక్షణ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు ఈ శిబిరంలో పాల్గొని రక్తాన్ని సేకరించారు. గ్రామానికి చెందిన సుమారు 35 మంది యువకులు, పెద్దలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ముఖ్యంగా చిందేపల్లి గ్రామం నుండి తిరుపతిలోని ఎస్జీఎస్ కళాశాలకు వెళ్లి చదువుకుంటున్న విద్యార్థులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని సామాజిక బాధ్యతను చాటుకున్నారు. ప్రాణాపాయంలో ఉన్న వారిని ఆదుకోవడానికి రక్తదానం ఎంతో మేలు చేస్తుందని, ఈ శిబిరానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

