నెల్లూరు జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. మసీదులు, ప్రార్థనా స్థలాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తూ భక్తుల ప్రార్థనలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళికతో వాహన రాకపోకలను క్రమబద్ధీకరించారు. అదనంగా డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.



