రంజాన్ ఇఫ్తార్ విందులో పాల్గొన్న ప్రజాప్రతినిధులు….
సిపిఎం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహా ఆధ్వర్యంలో హైమద్ నివాసంలో ఏర్పాటు
పున్నమి న్యూస్ ప్రతినిధి
18 మార్చి 2026
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ :
ఆలంపల్లి దుర్గేష్
9640204826
పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని, సిపిఎం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహా ఆధ్వర్యంలో హైమద్ నివాసంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు మరియు నాయకులు పాల్గొన్నారు.
ముస్లిం సోదరులు ఎంతో నిష్టతో ఆచరించే ఈ రంజాన్ ఉపవాస దీక్షలు సమాజంలో శాంతిని, సోదరభావాన్ని పెంపొందిస్తాయని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. అందరూ కలిసి మెలిసి విందులో పాల్గొని, అల్లాహ్ ఆశీస్సులు అందరికీ కలగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో
సిపిఎం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహా , మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి , మాజీ MPTCలు మొరుగు రమేష్ , ముంత జంగయ్య , 9వ వార్డు సభ్యులు ఆలంపల్లి మహేష్ , 11వ వార్డు సభ్యులు వంగూరి మనోహర జంగయ్య , 10వ వార్డు సభ్యులు కలకొండ బీరప్ప , 12వ వార్డు సభ్యులు బూర సురేందర్ , 6వ వార్డు సభ్యులు అండెకార్ అనిల్ ,మాజీ వార్డు సభ్యులు జమ్మ మహేందర్ మరియు తదితరులు పాల్గొన్నారు.
“ఈద్ ముబారక్”




















