ఆగస్టు 3: యోగ సాధన ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగం కావాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సూచించారు. ఆదివారం నరసన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి యోగా పోటీలను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రాథమిక స్థాయిలో నుంచే యోగాభ్యాసం అలవాటు చేస్తే, అది వ్యక్తికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. యోగా వల్ల మనశ్శాంతి, శారీరక సామర్థ్యం కలుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ దీనిని దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలి,” అని పేర్కొన్నారు.పోటీలు విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే, యోగా శిక్షకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు యోగా శిక్షకులు, విద్యార్థులు పాల్గొన్నారు.




