ఖమ్మం అక్టోబర్
(పున్నమి ప్రతి నిధి)
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం లోని పెనుబల్లి మండలం ఎరుగట్ల డబల్ బెడ్ రూమ్ మరియు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో జరుగుతున్న అక్రమాలపై ఏరుగట్ల గ్రామ బాధితులు, ఖమ్మం జిల్లా బీజేపీ నేతలు ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురుశెట్టి గారిని కలిసి ఫిర్యాదులు అందజేశారు. కలెక్టర్, 15 మంది బాధితులకు ప్రాధాన్యతతో డబల్ బెడ్ రూమ్లు కేటాయిస్తామని, మిగిలిన ఇళ్లు అర్హులకే ఇస్తాం హామీ ఇచ్చారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు కూడా బాధితులకు న్యాయం చేయాలని స్పందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, ఈవి రమేష్, విజయ రాజు నంబూరి రామలింగేశ్వరావ్, సుదర్శన్ మిశ్రా , వీరం రాజు పడిగల మధు, తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.


