కామారెడ్డి, డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) :
రైతులకు యూరియా కొనుగోలు సులభంగా జరగేలా మొబైల్ యాప్ ద్వారా బుకింగ్ విధానా న్ని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఐఏఎస్ గోపి గురు వారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా, మండల వ్యవసాయ అధికారులకు, డీలర్లకు వివరించారు. ఈనెల 20న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ యాప్ను ప్రారంభిస్తారని డైరెక్టర్ తెలిపారు.ఈయాప్లో రైతులు సమీప డీలర్ల వద్ద జిల్లా స్థాయిలో ఎన్ని యూరియా బస్తాలు లభిస్తు న్నాయో తెలుసుకోవచ్చని చెప్పారు.తమ పంట వివరాలు, సాగు విస్తీర్ణం నమోదు చేస్తే యూరియా పరిమాణం స్వయంగా చులకంగా లెక్కించ బడు తుంది. బుకింగ్ పూర్తయిన వెంటనే బుకింగ్ ఐడి లభిస్తుంది.ఆ ఐడి చూపించి డీలర్ వద్ద యూరి యా పొందవచ్చునని అన్నారు.ముందస్తు బుకింగ్ సౌకర్యంతో పాటు రైతులు తమకు అనుకూలమైన డీలర్ను ఎంపిక చేసుకోవచ్చని గోపి సూచించారు. ఈ కార్యక్రమంలో ఏవో భాను శ్రీ, ఏఈవోలు నిఖిత, భబిత తదితరులు, డీలర్లు పాల్గొన్నారు.


