మహబూబాబాద్ జిల్లాలోని ఓ ఎరువుల దుకాణం వద్ద ఇద్దరు మహిళలు ఘోరంగా కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
మహబూబాబాద్(D)లోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్దకు ఇద్దరు మహిళలు యూరియా కోసం వచ్చారు. అక్కడ ఆధార్ కార్డు నమోదు విషయంలో ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో ఆ మహిళలు చెప్పులతో కొట్టుకుంటూ నడిరోడ్డుపై జుట్లు పట్టుకుని దాడి చేసుకున్నారు. పక్కనే ఉన్నవారు వారిద్దరినీ విడదీయడంతో శాంతించారు.


