యూరియా పంపిణీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం – ఈ-పంట నమోదు తప్పనిసరి!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూరియా కొరత, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కేవలం ఈ-పంట నమోదు చేసుకున్న రైతులకే యూరియా అందుబాటులో ఉంటుంది. రాబోయే రబీ సీజన్ నుండి పంపిణీలో ఆధార్ OTP వెరిఫికేషన్ వ్యవస్థను అమలు చేయనున్నారు. రైతు ఆధార్కి లింక్ అయిన మొబైల్ నంబర్కి OTP వస్తుంది, ధృవీకరణ పూర్తయిన తర్వాత అవసరమైన యూరియా మూడు విడతల్లో ఇవ్వబడుతుంది.
అదనంగా, యూరియా వాడకాన్ని తగ్గించే రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహకంగా ప్రతి తగ్గించిన బస్తాకు ₹800 ఆర్థిక సహాయం అందజేస్తుంది. రైతులందరూ అక్టోబర్ 25 లోపు తప్పనిసరిగా ఈ-పంట నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. గడువు మించితే యూరియాతో పాటు ఇతర ప్రభుత్వ పథకాలు, బీమా ప్రయోజనాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.


