*యుద్ధ ప్రాతిపదికన బ్రిడ్జి పనులు మొదలుపెట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురండి.*
మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు
అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు అక్టోబర్ 29 (మనం న్యూస్ ప్రతినిధి): రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండల కేంద్రంలో
రైల్వే అండర్ బ్రిడ్జి ప్రమాదకరపు స్థాయి ఉన్నందున, బ్రిడ్జి ను పరిశీలించిన మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు. మేంథా తుఫాన్ కారణంగా గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా మండల ప్రజలకు రవాణా సౌకర్యంగా ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి లోకి వర్షపు నీరు చేరి ప్రమాదకర స్థాయిలో ఉండడంతో బ్రిడ్జిని పరిశీలించి తక్షణమే మోటార్లు ఏర్పాటు చేసి నీటిని తొలగించి, వీలైనంత త్వరగా ప్రజలకు అండర్ బ్రిడ్జి అందుబాటులోకి తీసుకురావాలని రాబోయే రోజులు కూడా వర్షకాలమే కాబట్టి భవిష్యత్తులో ఎటువంటి సమస్యలో తలెత్త కుండా చూసుకోవాలని సర్పంచ్ జైపాల్ రెడ్డి కి నుచించారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సాయి కిషోర్ రెడ్డి, సీనియర్ నాయకులు దుర్గా నాగేంద్ర, సుబ్రహ్మణ్యం రెడ్డి, మరియు వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.


