యాచారం మండల్ లోని గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు నిర్లక్ష్యంతో శిశువు మృతి
డెలివరీ సమయంలో జాగ్రత్తలు పాటించలేదని కుటుంబీకుల ఆరోపణ
పున్నమి న్యూస్ ప్రతినిధి
21 ఫిబ్రవరి 2026
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ :
డెలివరీ సమయంలో జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల మగ బిడ్డ చనిపోయాడని బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం మల్కిస్గుడా గ్రామానికి చెందిన నానకపేట కళ్యాణిని ఆమె భర్త కృష్ణ డెలివరీ కోసం యాచా రం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె మగ బిడ్డకు జన్మినిచ్చింది. అ యితే శిశువు మృతి చెందాడు. ప్రసవం సమయం లో వైద్యులు సరియైన జాగ్రత్తలు తీసుకోలేదని, ప్రసవం కాకపోతే హైదరాబాద్లోని పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్తామని ప్రాధేయపడిన వినకుండా వైద్యులు నిర్లక్ష్యం వహించారని కుటుంబీకులు ఆరోపించారు. వైద్యులు అందుబాటులో ఉండ డం లేదని, నర్సులే డెలివరీలు చేస్తున్నారని, అందువల్లనే ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.


