అనకాపల్లి జిల్లా ఏప్రిల్ 8 : ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్తగా నిర్మించిన అవుట్ పేషెంట్ (ఓపీ) భవనాన్ని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ భవనం ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని తెలిపారు. టోయోట్సు రేర్ ఎర్త్స్ ఇండియా సంస్థ CSR నిధులతో నిర్మించిన ఈ సదుపాయం ఆధునిక వైద్య పరికరాలతో సిద్ధమైంది. ప్రజలకు సౌకర్యవంతమైన చికిత్స అందించడమే లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు


