Saturday, 19 July 2025
  • Home  
  • మొహమ్మద్ ఫక్రుద్దీన్ చారిటబుల్ ట్రస్ట్ వారి నిరంతర సేవలు 
- Featured

మొహమ్మద్ ఫక్రుద్దీన్ చారిటబుల్ ట్రస్ట్ వారి నిరంతర సేవలు 

గూడూరు మే 21, 2020 (పున్నమి ప్రతినిధి – షేక్. రసూల్ అహమద్ ) : లాక్ డౌన్ విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పవిత్ర రంజాన్ మాసంలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు వుండే 150 ముస్లిం కుటుంబాలకు ఒక్కో ఇంటికి 5 కిలోల బియ్యం, ఒక చీర చొప్పున మొహమ్మద్  ఫక్రుద్దీన్ చారిటబుల్  ట్రస్ట్ వారు పంపిణి చేశారు. గురువారం నాడు గూడూరు పట్టణంలోని నమాజ్ కట్ట, బనిగి సాహెబ్ పేట, సాధుపేట, చిన్న చేపల మార్కెట్ వీధి నందు, ఫక్రుద్దీన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వచ్చందంగా ఇంటింటికీ వెళ్లి అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ ఫౌండర్ మొహమ్మద్ మగ్ధూమ్ మొహిద్దీన్ మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి ప్రతి రంజాన్ పండుగ సందర్భంగా నిరుపేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని. అందులో భాగంగానే ఈ సంవత్సరం ప్రభుత్వ సూచనలను అనుసరిస్తూ భౌతిక దూరం పాటిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి అందించడం జరిగిందని అన్నారు. అలాగే ట్రస్టుకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్న మిత్రులకు, కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసారు. సంస్థ గౌరవ సలహాదారులు షేక్.గౌస్ బాషా మాట్లాడుతూ మొహమ్మద్ ఫక్రుద్దీన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతాయని, రంజాన్ పండుగ సందర్భంగా  కరోనా మహమ్మారి దూరమై అందరూ సుభిక్షంగా ఉండాలని అల్లాను కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ముందస్తు పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు ఫౌండర్ మగ్ధుమ్, సంస్థ అధ్యక్షుడు మొహమ్మద్ సర్తాజుద్దీన్, గౌరవ అధ్యక్షురాలు సఫ్నాజ్, ఫరీనా, గౌరవ సలహాదారులు గౌస్ బాషా, ఉపాధ్యక్షులు మహబూబ్ బాషా, కార్యదర్శి యాసీన్, కోశాధికారి అమృద్దిన్, సభ్యులు అయాజ్, సమద్, అలీం తదితరులు పాల్గొన్నారు.



గూడూరు మే 21, 2020 (పున్నమి ప్రతినిధి – షేక్. రసూల్ అహమద్ ) : లాక్ డౌన్ విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పవిత్ర రంజాన్ మాసంలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు వుండే 150 ముస్లిం కుటుంబాలకు ఒక్కో ఇంటికి 5 కిలోల బియ్యం, ఒక చీర చొప్పున మొహమ్మద్  ఫక్రుద్దీన్ చారిటబుల్  ట్రస్ట్ వారు పంపిణి చేశారు. గురువారం నాడు గూడూరు పట్టణంలోని నమాజ్ కట్ట, బనిగి సాహెబ్ పేట, సాధుపేట, చిన్న చేపల మార్కెట్ వీధి నందు, ఫక్రుద్దీన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వచ్చందంగా ఇంటింటికీ వెళ్లి అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ ఫౌండర్ మొహమ్మద్ మగ్ధూమ్ మొహిద్దీన్ మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి ప్రతి రంజాన్ పండుగ సందర్భంగా నిరుపేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని. అందులో భాగంగానే ఈ సంవత్సరం ప్రభుత్వ సూచనలను అనుసరిస్తూ భౌతిక దూరం పాటిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి అందించడం జరిగిందని అన్నారు. అలాగే ట్రస్టుకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్న మిత్రులకు, కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసారు. సంస్థ గౌరవ సలహాదారులు షేక్.గౌస్ బాషా మాట్లాడుతూ మొహమ్మద్ ఫక్రుద్దీన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతాయని, రంజాన్ పండుగ సందర్భంగా  కరోనా మహమ్మారి దూరమై అందరూ సుభిక్షంగా ఉండాలని అల్లాను కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ముందస్తు పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు ఫౌండర్ మగ్ధుమ్, సంస్థ అధ్యక్షుడు మొహమ్మద్ సర్తాజుద్దీన్, గౌరవ అధ్యక్షురాలు సఫ్నాజ్, ఫరీనా, గౌరవ సలహాదారులు గౌస్ బాషా, ఉపాధ్యక్షులు మహబూబ్ బాషా, కార్యదర్శి యాసీన్, కోశాధికారి అమృద్దిన్, సభ్యులు అయాజ్, సమద్, అలీం తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.