డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని నగరం అగ్రహారం గ్రామం మొంథా తుపాన్ ప్రభావంతో తీవ్ర నష్టం చవిచూసింది. భారీ గాలులు, వర్షాల కారణంగా గ్రామంలో అనేక చెట్లు విరిగి విద్యుత్ స్తంభాలపై పడి తీగలు తెగిపోవడంతో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. స్థానిక ప్రజలు చీకట్లో కష్టాలు పడుతుండగా, పరిస్థితిని తక్షణమే అర్థం చేసుకున్న విద్యుత్ శాఖ అధికారులు పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించారు.
ధోన్ డివిజన్, నంద్యాల సర్కిల్కి చెందిన రాయలసీమ విద్యుత్ సిబ్బంది ఈ కష్టసమయంలో నిజమైన సేవా భావంతో ముందుకు వచ్చారు.
ఏఈ నాగేశ్వరరెడ్డి, ఏడిఈ నాగేంద్ర, లైన్మెన్ లాజర్, కాటమరాజు, జూనియర్ లైన్మెన్ బృందం ఎటువంటి భయం లేకుండా వర్షం, గాలులకు ఎదురీది విద్యుత్ తీగలను, స్తంభాలను మరమ్మతు చేసి విద్యుత్ సరఫరాను పునఃప్రారంభించారు. వారి సమయస్పూర్తి, ధైర్యం, ప్రజల పట్ల ఉన్న నిబద్ధత అభినందనీయమైనది.
ఈ రాయలసీమ వీరులు తమ సొంత ప్రాంతం దూరంగా, ప్రాణాలకు ముప్పు ఉన్న సమయంలోనూ ప్రజల సౌకర్యం కోసం అహర్నిశలు శ్రమించారు. వారి సేవా తపన, విధిపట్ల ఉన్న నిజాయితీ, మన సమాజానికి ఆదర్శప్రాయమైనవి. మొంథా తుపాన్ వల్ల తీవ్ర నష్టం ఎదుర్కొన్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ ప్రజలకు ఈ విద్యుత్ సిబ్బంది కృషి ఆశాజ్యోతి నింపింది.
ఈ కష్టకాలంలో సేవా ధర్మాన్ని నిలబెట్టిన ఏఈ నాగేశ్వరరెడ్డి గార్కి, ఏడిఈ నాగేంద్ర గార్కి లైన్మెన్ లాజర్ గార్కి , కాటమరాజు గార్కి మరియు మొత్తం జూనియర్ లైన్మెన్ బృందానికి ప్రజల తరఫున హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాము. వారి కృషి వల్ల డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మళ్లీ వెలుగులు నిండింది — వీరందరూ నిజమైన ప్రజాసేవకులు!


