మైనర్ గిరిజన బాలికలు అదృష్యం.
దమ్మపేట మండలం, అంకంపాలెం లో కలకలం.
పోలీసులకు ఫిర్యాదు చేసిన కళాశాల యాజమాన్యం.
దమ్మపేట మండల పరిదిలోని అంకంపాలెం గిరిజన గురుకుల బాలికల జూనియర్ కళాళాలలో ఇద్దరు మైనర్ బాలికలు అదృష్యమైన ఘటన స్ధానికంగా కలకలం రేపుతుంది. ఆదివారం ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్ధానిక పోలీసులకు కళాశాల ఉపాధ్యాయ బృందం ఫిర్యాదు చేశారు. స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ సాయికిషోర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ….
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ సమీపంలోని రేగళ్ళపాడుకు చెందిన ఇద్దరు గిరిజన మైనర్ బాలికలు, దమ్మపేట మండలం అంకంపాలెం లో ఉన్న గిరిజన బాలికల గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుచున్నారు. పాఠశాల అధ్యాపక బృందానికి సమాచారం ఇవ్వకుండా బయటకు వెళ్ళారు. ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి విద్యార్ధినిల తల్లిదండ్రులకు విషయం తెలియజేశారు. తల్లిదండ్రులు ,బంధువుల తో కలిసి చుట్టుపక్కల పల్లెల్లో ,గ్రామాల్లో ఆచూకీ కోసం యత్నాలు చేశారు. ఎంతకీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆదివారం రాత్రి సుమారుగా 11 గం.ల సమయంలో దమ్మపేట పోలీసులకు లెక్చరర్ బాణోత్ హరిత ఫిర్యాదు చేశారు. ఉపాద్యాయ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు స్ధానిక పోలీసులకు తగిన సమాచారం అందించాలని కోరారు. సమాచారం తెలిపిన వారి వివరాలను గోప్యంగా ఉంచబడతాయని ఎస్ ఐ వెల్లడించారు.


