మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై
ప్రజాతీర్పుకు కుటమిప్రభుత్వం తలవంచాలి : *మాజీ శాసనసభ్యులు మళ్ళ విజయ ప్రసాద్*
విశాఖపట్నం డిసెంబర్ పున్నమి ప్రతినిధి:-
* మింది లో గల పశ్చిమ నియోజకవర్గం క్యాంప్ కార్యాలయంలో *మాజీ శాసనసభ్యులు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మల్ల విజయప్రసాద్ మాజీ శాసనసభ్యులు పార్టీ పరిశీలికలు *చింతలపూడి వెంకటరమణయ్య సమక్షంలో పశ్చిమ నియోజకవర్గం 14 వార్డులలో ప్రజల వద్ద నుంచి స్వీకరించిన కోటిసంతకాల పత్రాల box లను ఫ్రంట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సమక్షంలో పబ్లికేషన్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా మల్ల విజయప్రసాద్ మాట్లాడుతూ..
మెడికల్ కాలేజ్ ల ప్రైవేటీకరణ చేయొద్దంటూ పశ్చిమ నియోజకవర్గ
14 వార్డులో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వద్దంటూ ప్రజల నుండి సేకరించిన పత్రాలను రేపు పశ్చిమ నియోజకవర్గం కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, సీనియర్ నాయకులు సమక్షంలో జిల్లా పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు కేకే రాజు గార్కి అందించడం జరుగుతుందని అక్కడ నుంచి త్వరలోనే అధిష్టానానికి అందజేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, వార్డ్ అధ్యక్షులు,వార్డ్ పార్టీ పరిశీలకులు,రాష్ట్ర,జిల్లా స్థాయి నాయకులు,జిల్లా అనుబంధం భాగాల అధ్యక్షులు, నియోజకవర్గ అనుబంధం భాగాల అధ్యక్షులు, వార్డ్ అనుబంధం భాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.


