1 లక్ష రూపాయల చెక్కును ఆర్థిక సాయంగా బీజేపీ ఆచారి గారు అందజేత…
కల్వకుర్తి అసెంబ్లీ : వెల్దండ మండలంలో భారతీయ జనతా పార్టీకి 30 సంవత్సరాలుగా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా సేవలందించి కొన్ని రోజుల క్రితం అకాల మరణం చెందిన, వెల్దండ గ్రామ మాజీ ఉప సర్పంచ్ కి,శే చిమ్ముల శ్రీనివాస్ రెడ్డి గారి నివాసానికి చేరుకొని బీజేపీ నేత జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు శ్రీ తల్లోజు ఆచారి గారు, వెల్దండ మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు తమ వంతు ఆర్ధిక సాయంగా చెక్కును వారి కుటుంబానికి రూ 1 లక్ష రూపాయలను అందజేశారు.
అలాగే ఇంకా 1 లక్ష 40 వేల రూపాయలను వారి పిల్లల పై చదువుల కొరకు అందిస్తాం అని చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కల్వకుర్తి అసెంబ్లీ బీజేపీ పార్టీ కన్వీనర్ శేఖర్ రెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, కృష్ణ రెడ్డి, మోహన్ రెడ్డి, మట్ట పరమేష్ గౌడ్, మట్ట విష్ణు గౌడ్, రవి కుమార్ బీజేపీ నాయకుడు శ్రీశైలం, దేవేందర్, కొండల్, పెద్దయ్య తదితరులు పాల్గొనడం జరిగింది.


