ముమ్మిడివరం మండలం అన్నంపల్లి టోల్గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం అమలాపురం వైపు నుండి వస్తున్న టిప్పర్ లారీ, యానం నుంచి ముమ్మిడివరం వెళ్తున్న పల్సర్ బండి డీకొన్నాయి. ఒక మోటార్ సైకిల్ పై నలుగురు వ్యక్తులు ప్రయాణం చేస్తున్నట్టు సమాచారం. ఈ ఘటన లో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో మహిళ తల మొండెం వేరుగా పడింది. టి.కొత్తపల్లి గ్రామానికి చెందిన ఉందుర్తి బాలు, బొమ్మి వినోద్, గొల్లపాలెం గ్రామానికి చెందిన ఖండవల్లి రాజు, క్రాప గ్రామానికి చెందిన నిడమోలు ఉమా మహేశ్వరరావుగా పోలీసులు గుర్తించారు. సమాచారం తెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకున్న ముమ్మిడివరం పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేసి క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.


