*రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఉండవల్లి ఆయన నివాసం నందు కడప జిల్లా ఇంచార్జ్ మంత్రి సవితమ్మ గారు,జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు,మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారు,కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి గారు,కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి రెడ్డి గారు,పులివెందుల తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బీటెక్ రవి గారు,రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ జగన్ మోహన్ రాజు గారితో కలిసి సమావేశమైన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు*
*ప్రొద్దుటూరు నియోజకవర్గానికి యునాని మెడికల్ కళాశాల 70 కోట్ల రూపాయలతో మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు*
*ఈ సందర్భంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జరుగుతున్న తాజా రాజకీయాలను ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి గారిని అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు*
*ఈ సమావేశంలో ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక సమస్యలను వరదరాజుల రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.రోడ్ల విస్తరణ,అండరు డ్రైనేజీ కాలువల ఆధునీకరణ,రైతుల వ్యవసాయ ఉత్పత్తుల కొరకు ప్రతి గ్రామానికి లింక్ రోడ్లు,నిర్మాణంలో ఉన్న నూతన కూరగాయల మార్కెట్ కొరకు నిధుల మంజూరు,నూతన RTC బస్టాండుకు కావలసిన నిధులు మంజూరు చేసి ప్రజలకు అందుబాటులోకి తేవడం,నిర్మాణంలో ఉన్న యోగివేమన ఇంజనీరింగ్ కళాశాల అదనపు భవనాలకు నిధుల మంజూరు,ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నూతన భవనాలకు నిధుల మంజూరు,నియోజక వర్గానికి స్పోర్ట్స్ కాంప్లెక్స్,నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వివరించి,లేవనెత్తిన అంశాలపై ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిసహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి గారికి హామీ ఇవ్వడం జరిగింది.*


