Tuesday, 10 February 2026
  • Home  
  • ముక్కంటీశునికి శ్రీశైల మల్లన్న పట్టువస్త్రాలు
- తిరుపతి

ముక్కంటీశునికి శ్రీశైల మల్లన్న పట్టువస్త్రాలు

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 10: శ్రీకాళహస్తి క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీశైలం దేవస్థానం తరపున శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞానప్రసూనాంబ అమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ కార్యక్రమం సంప్రదాయబద్ధంగా నిర్వహించబడింది. శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి (EO) ఎం. శ్రీనివాసరావు మంగళవాయిద్యాలు వేద మంత్రాల నడుమ పట్టువస్త్రాలను తలపై మోసుకుంటూ ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్నారు. ఆయనకు శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో బాపి రెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా శ్రీశైల దేవస్తాన ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ….శివరాత్రి పర్వదినం సందర్భంగా ఒక ప్రముఖ శైవ క్షేత్రం నుండి మరో క్షేత్రానికి పట్టువస్త్రాలు సమర్పించడం పురాతన ఆచారమని పేర్కొన్నారు. శ్రీశైల దేవస్తానం వారు సమర్పించిన ఈ పట్టువస్త్రాలను స్వామివారికి జరిగే ప్రత్యేక పూజలు మరియు కళ్యాణోత్సవం సమయంలో అలంకరించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు, వేద పండితులు, భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 10: శ్రీకాళహస్తి క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీశైలం దేవస్థానం తరపున శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞానప్రసూనాంబ అమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ కార్యక్రమం సంప్రదాయబద్ధంగా నిర్వహించబడింది. శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి (EO) ఎం. శ్రీనివాసరావు మంగళవాయిద్యాలు వేద మంత్రాల నడుమ పట్టువస్త్రాలను తలపై మోసుకుంటూ ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్నారు. ఆయనకు శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో బాపి రెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా శ్రీశైల దేవస్తాన ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ….శివరాత్రి పర్వదినం సందర్భంగా ఒక ప్రముఖ శైవ క్షేత్రం నుండి మరో క్షేత్రానికి పట్టువస్త్రాలు సమర్పించడం పురాతన ఆచారమని పేర్కొన్నారు. శ్రీశైల దేవస్తానం వారు సమర్పించిన ఈ పట్టువస్త్రాలను స్వామివారికి జరిగే ప్రత్యేక పూజలు మరియు కళ్యాణోత్సవం సమయంలో అలంకరించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు, వేద పండితులు, భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.