పలమనేరు జూన్1,2020(పున్నమి విలేకరి): పలమనేరు పట్టణ సమీపంలోని కేటీల్ ఫారం పలమనేరు- కుప్పం రహదారి గుండా వెళ్లే వాహనాలను ఏఎస్ఐ శ్రీధర్ తన సిబ్బందితో కలిసి తనిఖీ చేపట్టారు. అతి వేగంతో ప్రయాణిస్తున్న వాహనాలను అపి జరిమానాలు వేశారు. అలాగే ఓవర్ లోడ్ తో వెళుతున్న ఆటోలకు కూడా జరిమానాలు విధించారు. ఏఎస్ఐ శ్రీధర్ మాట్లాడుతూ… ద్విచక్ర వాహనం నడిపే చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అలాగే కారులో ప్రయాణించే సమయంలో డ్రైవర్ తో పాటు ప్రయాణికులు సీటు బెల్టు ధరించాలని సూచించారు. అతి వేగంతో వాహనం నడిపితే ప్రమాదం తప్పదన్నారు.అతి వేగంతో వాహనం నడిపితే ప్రమాదం తప్పుదన్నారు. అధిక శాతం ప్రమాదాలు మితిమీరిన వేగంతో జరిగినట్లు చెప్పారు. మీరు క్షేమంగా ఇంటికి వెళితే కుటుంబంతో సంతోషంగా ఉంటుందని భావన కలగాలన్నారు. ప్రమాదం తగ్గించాలనే లక్ష్యంతో నే వాహనచోదకులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు పాటించకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
మితిమీరిన వేగం అత్యంత ప్రమాదకరం
పలమనేరు జూన్1,2020(పున్నమి విలేకరి): పలమనేరు పట్టణ సమీపంలోని కేటీల్ ఫారం పలమనేరు- కుప్పం రహదారి గుండా వెళ్లే వాహనాలను ఏఎస్ఐ శ్రీధర్ తన సిబ్బందితో కలిసి తనిఖీ చేపట్టారు. అతి వేగంతో ప్రయాణిస్తున్న వాహనాలను అపి జరిమానాలు వేశారు. అలాగే ఓవర్ లోడ్ తో వెళుతున్న ఆటోలకు కూడా జరిమానాలు విధించారు. ఏఎస్ఐ శ్రీధర్ మాట్లాడుతూ… ద్విచక్ర వాహనం నడిపే చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అలాగే కారులో ప్రయాణించే సమయంలో డ్రైవర్ తో పాటు ప్రయాణికులు సీటు బెల్టు ధరించాలని సూచించారు. అతి వేగంతో వాహనం నడిపితే ప్రమాదం తప్పదన్నారు.అతి వేగంతో వాహనం నడిపితే ప్రమాదం తప్పుదన్నారు. అధిక శాతం ప్రమాదాలు మితిమీరిన వేగంతో జరిగినట్లు చెప్పారు. మీరు క్షేమంగా ఇంటికి వెళితే కుటుంబంతో సంతోషంగా ఉంటుందని భావన కలగాలన్నారు. ప్రమాదం తగ్గించాలనే లక్ష్యంతో నే వాహనచోదకులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు పాటించకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.