వింజమూరు పట్టణంలోని స్థానిక విఆర్ ఫంక్షన్ ప్లాజాలో టిడిపి ముఖ్య నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మండల కన్వీనర్ గూడా నర్సారెడ్డి మాట్లాడుతూ నిన్న వరికుంటపాడు వైఎస్ఆర్సిపి ఆత్మీయ అభినందన సభలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఉదయగిరి ఇంచార్జ్ రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు వారి స్థాయికి తగదని,గూడా మండిపడ్డారు. ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ను విమర్శించే స్థాయి మీది కాదని ఆయన ఏద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో మీరు చేసిన అరాచకాలకు ప్రజలు బుద్ధి చెప్పిన ఇంకా మీలో మార్పు రాలేదని, ఒకరిని విమర్శించే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాలు సూపర్ గా హిట్ అయ్యాయని ప్రజలను ఎవరిని అడిగినా వారే చెబుతారుఅన్నారు. ఉదయగిరి ప్రాంతానికి శాసనసభ్యులుగా కాకర్ల సురేష్ ఉండడం ఈ ప్రాంత ప్రజలకు ఒక వరంగా భావిస్తున్నారు. ప్రతి గడపలోని సమస్యలను తెలుసుకున్న నాయకుడు, ఆపదలో ఆదుకున్న ఆపద్బాంధవుడు మా కాకర్ల సురేష్ అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మోహన్ రెడ్డి,ఉపాధ్యక్షులు రమణయ్య,సొసైటీ డైరెక్టర్లు, టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నీ విమర్శించే స్థాయి మీది కాదు.
వింజమూరు పట్టణంలోని స్థానిక విఆర్ ఫంక్షన్ ప్లాజాలో టిడిపి ముఖ్య నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మండల కన్వీనర్ గూడా నర్సారెడ్డి మాట్లాడుతూ నిన్న వరికుంటపాడు వైఎస్ఆర్సిపి ఆత్మీయ అభినందన సభలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఉదయగిరి ఇంచార్జ్ రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు వారి స్థాయికి తగదని,గూడా మండిపడ్డారు. ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ను విమర్శించే స్థాయి మీది కాదని ఆయన ఏద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో మీరు చేసిన అరాచకాలకు ప్రజలు బుద్ధి చెప్పిన ఇంకా మీలో మార్పు రాలేదని, ఒకరిని విమర్శించే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాలు సూపర్ గా హిట్ అయ్యాయని ప్రజలను ఎవరిని అడిగినా వారే చెబుతారుఅన్నారు. ఉదయగిరి ప్రాంతానికి శాసనసభ్యులుగా కాకర్ల సురేష్ ఉండడం ఈ ప్రాంత ప్రజలకు ఒక వరంగా భావిస్తున్నారు. ప్రతి గడపలోని సమస్యలను తెలుసుకున్న నాయకుడు, ఆపదలో ఆదుకున్న ఆపద్బాంధవుడు మా కాకర్ల సురేష్ అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మోహన్ రెడ్డి,ఉపాధ్యక్షులు రమణయ్య,సొసైటీ డైరెక్టర్లు, టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

