Tuesday, 24 March 2026
  • Home  
  • మావోయిస్టుల ఎన్‌కౌంటర్లను ఖండించిన పౌర ప్రజా సంఘాలు విశాఖపట్నంలో పత్రికా సమావేశం
- విశాఖపట్నం

మావోయిస్టుల ఎన్‌కౌంటర్లను ఖండించిన పౌర ప్రజా సంఘాలు విశాఖపట్నంలో పత్రికా సమావేశం

పోలీసులు ప్రకటించిన “హిడ్మా, రాజేలా సహా మావోయిస్టుల ఎన్‌కౌంటర్ మరణాలు” అలాగే “50 మంది అరెస్టులు” అనే వివరాలను పూర్తిగా ఖండిస్తూ పౌర, ప్రజా సంఘాల వేదిక ఆధ్వర్యంలో అల్లిపురంలోని సిపిఐ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్క్సిస్టు అధ్యయన కేంద్రం కన్వీనర్ జె.వి. సత్యనారాయణమూర్తి, పౌర ప్రజా సంఘాల వేదిక సమన్వయకర్త చంద్రశేఖర్, పౌరహక్కుల సంఘం నేత విష్ణువర్ధనరావు, అరుణోదయ సాంస్కృతిక సంస్థ ప్రతినిధులు నిర్మల, రామకృష్ణ, రాజకీయ ఖైదీల విడుదల కమిటీకి చెందిన న్యాయవాది కె. పద్మ, ఐఎఫ్టియు నాయకుడు తిరుపతిరావు, న్యాయవాది అన్నపూర్ణ, ప్రగతిశీల కార్మిక సమాఖ్య, ఎం ఎన్ ఎస్ ఎస్ కార్యకర్తలు, అలాగే ఆంధ్రప్రదేశ్ మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు నెయ్యల నాగభూషణరావు తదితరులు పాల్గొన్నారు. పోలీసుల ప్రకటనలో వైరుధ్యాలు జె.వి. సత్యనారాయణమూర్తి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ “పోలీసుల కథనం పూర్తిగా అస్పష్టంగా ఉంది. మూడు రోజుల క్రితం ‘ఏలూరు సమీపంలోని గ్రీన్‌సిటీలో 15 రోజుల నుంచి మావోయిస్టులు ఉంటున్నారని సమాచారం రావడంతో వారిని అరెస్టు చేశాం’ అని అధికారిక సమాచారం విడుదలైంది. కానీ అదే సమయంలో ‘నిన్న ఆరుగురు, ఇవాళ ఏడుగురిని ఎన్‌కౌంటర్ చేశాం’ అని మరో ప్రకటన ఇచ్చారు. ఇవి పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు” అని చెప్పారు. “అరెస్టు చేసిన వారిలో కొందరిని ఎంచుకుని కల్పిత ఎన్‌కౌంటర్ పేరిట చంపేసారనే అనుమానం బలపడుతోంది” అని అన్నారు. కార్పొరేట్ల లాభాల కోసం మావోయిస్టులపై దాడులు ఆరోపణలు సభలోని పలువురు నేతలు మాట్లాడుతూ కార్పొరేట్ల చేతుల్లో దేశపు సహజ వనరులను కేటాయించడానికి మార్గం సుగమం చేయడానికి బిజెపి ప్రభుత్వం మావోయిస్టులపై ఆపరేషన్లను వేగవంతం చేస్తోందని కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ ప్రకటించిన విధానం ఆ దిశగానే సాగుతోందని తీవ్రంగా విమర్శించారు. పత్రికా సమావేశం డిమాండ్లు సమావేశం ప్రభుత్వం, పోలీసులు తీసుకోవాల్సిన చర్యలుగా ఈ డిమాండ్లను ప్రకటించింది: 1. అరెస్టు చేసిన వారిని చట్ట ప్రకారం 24 గంటల్లో కోర్టులో హాజరు పరచాలి 2. ఎన్‌కౌంటర్ పేరిట చంపిన ఘటనలను హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయపరమైన విచారణ జరపాలి 3. పోలీసుల పాత్ర, సమాచారం, సంఘటనలపై జరిగిన “వైరుధ్యాలను” బహిర్గతం చేయాలి

పోలీసులు ప్రకటించిన “హిడ్మా, రాజేలా సహా మావోయిస్టుల ఎన్‌కౌంటర్ మరణాలు” అలాగే “50 మంది అరెస్టులు” అనే వివరాలను పూర్తిగా ఖండిస్తూ పౌర, ప్రజా సంఘాల వేదిక ఆధ్వర్యంలో అల్లిపురంలోని సిపిఐ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మార్క్సిస్టు అధ్యయన కేంద్రం కన్వీనర్ జె.వి. సత్యనారాయణమూర్తి, పౌర ప్రజా సంఘాల వేదిక సమన్వయకర్త చంద్రశేఖర్, పౌరహక్కుల సంఘం నేత విష్ణువర్ధనరావు, అరుణోదయ సాంస్కృతిక సంస్థ ప్రతినిధులు నిర్మల, రామకృష్ణ, రాజకీయ ఖైదీల విడుదల కమిటీకి చెందిన న్యాయవాది కె. పద్మ, ఐఎఫ్టియు నాయకుడు తిరుపతిరావు, న్యాయవాది అన్నపూర్ణ, ప్రగతిశీల కార్మిక సమాఖ్య, ఎం ఎన్ ఎస్ ఎస్ కార్యకర్తలు, అలాగే ఆంధ్రప్రదేశ్ మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు నెయ్యల నాగభూషణరావు తదితరులు పాల్గొన్నారు.

పోలీసుల ప్రకటనలో వైరుధ్యాలు

జె.వి. సత్యనారాయణమూర్తి

సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ
“పోలీసుల కథనం పూర్తిగా అస్పష్టంగా ఉంది.
మూడు రోజుల క్రితం ‘ఏలూరు సమీపంలోని గ్రీన్‌సిటీలో 15 రోజుల నుంచి మావోయిస్టులు ఉంటున్నారని సమాచారం రావడంతో వారిని అరెస్టు చేశాం’ అని అధికారిక సమాచారం విడుదలైంది.
కానీ అదే సమయంలో ‘నిన్న ఆరుగురు, ఇవాళ ఏడుగురిని ఎన్‌కౌంటర్ చేశాం’ అని మరో ప్రకటన ఇచ్చారు. ఇవి పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు” అని చెప్పారు.

“అరెస్టు చేసిన వారిలో కొందరిని ఎంచుకుని కల్పిత ఎన్‌కౌంటర్ పేరిట చంపేసారనే అనుమానం బలపడుతోంది” అని అన్నారు.

కార్పొరేట్ల లాభాల కోసం మావోయిస్టులపై దాడులు ఆరోపణలు

సభలోని పలువురు నేతలు మాట్లాడుతూ

కార్పొరేట్ల చేతుల్లో దేశపు సహజ వనరులను కేటాయించడానికి మార్గం సుగమం చేయడానికి బిజెపి ప్రభుత్వం మావోయిస్టులపై ఆపరేషన్లను వేగవంతం చేస్తోందని

కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ ప్రకటించిన విధానం ఆ దిశగానే సాగుతోందని
తీవ్రంగా విమర్శించారు.

పత్రికా సమావేశం డిమాండ్లు

సమావేశం ప్రభుత్వం, పోలీసులు తీసుకోవాల్సిన చర్యలుగా ఈ డిమాండ్లను ప్రకటించింది:

1. అరెస్టు చేసిన వారిని చట్ట ప్రకారం 24 గంటల్లో కోర్టులో హాజరు పరచాలి

2. ఎన్‌కౌంటర్ పేరిట చంపిన ఘటనలను హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయపరమైన విచారణ జరపాలి

3. పోలీసుల పాత్ర, సమాచారం, సంఘటనలపై జరిగిన “వైరుధ్యాలను” బహిర్గతం చేయాలి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.