మానవ జీవన సరళని మార్చేది భగవద్గీత ఒకటేనని శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మల్లెంబాకం మునికృష్ణారెడ్డి తెలిపారు శనివారం ఆయన శ్రీకాళహస్తి దేవస్థానం ఏఈఓ మోహన్ కి భగవద్గీత మకరందాన్ని అందజేశారు ఈ సందర్భంగా మల్లెంబాకం మునికృష్ణారెడ్డి మాట్లాడుతూ నా దేశం ఒక భవద్గీత,నా దేశం అగ్నిపునీత సీత,నా దేశం కరుణతరంగా నా దేశం సంస్కార గంగా అని సినారె పలుకులు అమృత సత్యం అని.ప్రతి ఒక్కరికి భగవద్గీత మార్గం చూపించి సత్ప్రవర్తనతో నడిపించడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు.మానసిక ప్రశాంతతతో మనిషి జీవనము కొనసాగాలంటే భగవద్గీత చదవటం వినడం ఒక్కటే సరైన మార్గమని తెలిపారు. భగవద్గీత చదవాలని కోరిక ఉన్నవారు నన్ను సంప్రదిస్తే వారికి ఉచితంగా భగవద్గీత మకరందాన్ని అందచేస్తానని తెలియజేశారు.

మానవ జీవనసరళిని మార్చేదే భగవద్గీత
మానవ జీవన సరళని మార్చేది భగవద్గీత ఒకటేనని శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మల్లెంబాకం మునికృష్ణారెడ్డి తెలిపారు శనివారం ఆయన శ్రీకాళహస్తి దేవస్థానం ఏఈఓ మోహన్ కి భగవద్గీత మకరందాన్ని అందజేశారు ఈ సందర్భంగా మల్లెంబాకం మునికృష్ణారెడ్డి మాట్లాడుతూ నా దేశం ఒక భవద్గీత,నా దేశం అగ్నిపునీత సీత,నా దేశం కరుణతరంగా నా దేశం సంస్కార గంగా అని సినారె పలుకులు అమృత సత్యం అని.ప్రతి ఒక్కరికి భగవద్గీత మార్గం చూపించి సత్ప్రవర్తనతో నడిపించడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు.మానసిక ప్రశాంతతతో మనిషి జీవనము కొనసాగాలంటే భగవద్గీత చదవటం వినడం ఒక్కటే సరైన మార్గమని తెలిపారు. భగవద్గీత చదవాలని కోరిక ఉన్నవారు నన్ను సంప్రదిస్తే వారికి ఉచితంగా భగవద్గీత మకరందాన్ని అందచేస్తానని తెలియజేశారు.

