*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి*
మాధవధార ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహంలో మంత్రి డీఎస్ బీవీ స్వామి ఆకస్మిక తనిఖీ
హాస్టల్ పరిసరాలు పరిశీలించిన మంత్రి స్వామి
విద్యార్థినిలతో ముఖాముఖి నిర్వహించి హాస్టల్లో సౌకర్యాలు, సమస్యలు తెలుసుకున్న మంత్రి
విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకోవాలని సిబ్బందికి మంత్రి సూచన
విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ
వైసీపీ హయాంలో సమస్యలకు నిలయాలుగా ఉన్న గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలు నేడు పరిశుభ్ర,ఆరోగ్యకర వాతావరణంతో విద్యార్థులకు ఆనంద నిలయాలుగా మారాయి
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.143 కోట్లతో గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలకు మరమ్మతులు చేశాం
గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం
పేద పిల్లలు సమాజంలో గొప్ప స్థాయికి ఎదగాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యం అని
మంత్రి డా. డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు


