తొట్టంబేడు, పున్నమి, న్యూస్, మార్చి 11: తొట్టంబేడు మండలం రామచంద్రపురం గ్రామదేవత మాతమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలకు విచ్చేయాలని శ్రీకాళహస్తి నియోజిక వర్గ శాసనసభ్యులు బోజ్జల సుధీర్ రెడ్డిని గ్రామస్తులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ప్రతినిధులు ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేసి కార్యక్రమానికి విచ్చేయాలని కోరుతూ… రామచంద్రపురం గ్రామంలో నిర్వహించనున్న మాతమ్మ తల్లి దేవత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించేందుకు గ్రామస్తులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మహోత్సవాలకు పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారని ఎమ్మెల్యేకు వివరించారు. గ్రామస్తులు అందించిన ఆహ్వానాన్ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆనందంగా స్వీకరించి కార్యక్రమానికి తప్పకుండా విచ్చేసి తన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. గ్రామాల్లో జరిగే సంప్రదాయ ధార్మిక కార్యక్రమాలు సామాజిక ఐక్యతను బలోపేతం చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కుట్టుముల్ల చంద్రతో పాటు గ్రామ పెద్దలు, యువకులు ఎమ్మెల్యేను కలిశారు. ఈ కార్యక్రమంలో సరోజనమ్మ, మందా మస్తాన్, మందా వెంకటసుబ్బయ్య, మందా శ్యామలమ్మ, మల్లారపు మురళి, రమణయ్య, గిరి తదితరులు పాల్గొన్నారు. ఈ ఉత్సవాలకు గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆకాంక్షించారు.

మాతమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట వేడుకలకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఆహ్వానం
తొట్టంబేడు, పున్నమి, న్యూస్, మార్చి 11: తొట్టంబేడు మండలం రామచంద్రపురం గ్రామదేవత మాతమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలకు విచ్చేయాలని శ్రీకాళహస్తి నియోజిక వర్గ శాసనసభ్యులు బోజ్జల సుధీర్ రెడ్డిని గ్రామస్తులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ప్రతినిధులు ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేసి కార్యక్రమానికి విచ్చేయాలని కోరుతూ… రామచంద్రపురం గ్రామంలో నిర్వహించనున్న మాతమ్మ తల్లి దేవత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించేందుకు గ్రామస్తులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మహోత్సవాలకు పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారని ఎమ్మెల్యేకు వివరించారు. గ్రామస్తులు అందించిన ఆహ్వానాన్ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆనందంగా స్వీకరించి కార్యక్రమానికి తప్పకుండా విచ్చేసి తన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. గ్రామాల్లో జరిగే సంప్రదాయ ధార్మిక కార్యక్రమాలు సామాజిక ఐక్యతను బలోపేతం చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కుట్టుముల్ల చంద్రతో పాటు గ్రామ పెద్దలు, యువకులు ఎమ్మెల్యేను కలిశారు. ఈ కార్యక్రమంలో సరోజనమ్మ, మందా మస్తాన్, మందా వెంకటసుబ్బయ్య, మందా శ్యామలమ్మ, మల్లారపు మురళి, రమణయ్య, గిరి తదితరులు పాల్గొన్నారు. ఈ ఉత్సవాలకు గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆకాంక్షించారు.

