
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం కేంద్ర కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో విశాఖ జిల్లా నాయకులు పాల్గొన్నారు. అనంతరం పార్టీ అధినేతను మర్యాదపూర్వకంగా కలిసిన వారిలో జిల్లా పార్టీ అధ్యక్షులు కె.కె. రాజు, గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు ఉన్నారు.

