రైల్వే కోడూరు మాజీ శాసనసభ్యులు గుంటి వెంకటేశ్వర ప్రసాద్ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి విశ్వనాథ నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తిరుపతిలో చికిత్స పొందుతున్న ప్రసాద్ మంగళవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం చిట్వేలు పట్టణంలోని ఆయన స్వగృహానికి చేరుకున్న కస్తూరి విశ్వనాథ నాయుడు, మాజీ ఎమ్మెల్యే పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం గుంటి ప్రసాద్ కుటుంబ సభ్యులను కస్తూరి విశ్వనాథ నాయుడు పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుంటి ప్రసాద్ నియోజకవర్గ అభివృద్ధికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన మరణం రైల్వే కోడూరు రాజకీయాలకు తీరని లోటని పేర్కొన్నారు. మృదుస్వభావిగా అందరితో ఆప్యాయంగా ఉండే నాయకుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. మాజీ ఎమ్మెల్యేను కడసారి చూసేందుకు వివిధ రాజకీయ పార్టీల నేతలు, బంధువులు, శ్రేయోభిలాషులు మరియు ఆత్మీయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నియోజకవర్గవ్యాప్తంగా ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కస్తూరి విశ్వనాథ నాయుడు వెంట పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొని నివాళులర్పించారు.

మాజీ ఎమ్మెల్యే గుంటి ప్రసాద్కు కస్తూరి విశ్వనాథ నాయుడు ఘన నివాళి
రైల్వే కోడూరు మాజీ శాసనసభ్యులు గుంటి వెంకటేశ్వర ప్రసాద్ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి విశ్వనాథ నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తిరుపతిలో చికిత్స పొందుతున్న ప్రసాద్ మంగళవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం చిట్వేలు పట్టణంలోని ఆయన స్వగృహానికి చేరుకున్న కస్తూరి విశ్వనాథ నాయుడు, మాజీ ఎమ్మెల్యే పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం గుంటి ప్రసాద్ కుటుంబ సభ్యులను కస్తూరి విశ్వనాథ నాయుడు పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుంటి ప్రసాద్ నియోజకవర్గ అభివృద్ధికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన మరణం రైల్వే కోడూరు రాజకీయాలకు తీరని లోటని పేర్కొన్నారు. మృదుస్వభావిగా అందరితో ఆప్యాయంగా ఉండే నాయకుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. మాజీ ఎమ్మెల్యేను కడసారి చూసేందుకు వివిధ రాజకీయ పార్టీల నేతలు, బంధువులు, శ్రేయోభిలాషులు మరియు ఆత్మీయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నియోజకవర్గవ్యాప్తంగా ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కస్తూరి విశ్వనాథ నాయుడు వెంట పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొని నివాళులర్పించారు.

