రాజమహేంద్రవరం, సెప్టెంబరు 29: భవాని మాలధారణలో ఉన్న మాజీ ఎంపీ, వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి స్థానిక విఎల్ పురం మార్గాని ఎస్టేట్స్ లో సహస్ర కుంకుమార్చన, పడిపూజ, భవాని భజన జరిగాయి. భరత్ దంపతులు, కుమార్తెలు అలాగే రాష్ట్ర బిసి సంఘాల జేఏసీ అధ్యక్షుడు మార్గాని నాగేశ్వరరావు దంపతులు పీటలపై కూర్చుని శాస్త్రోక్తంగా కుంకుమార్చన, పడిపూజ నిర్వహించారు. శ్రీ దేవి నవరాత్రుల సందర్బంగా మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, వైసిపి మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు , పురప్రముఖులు,వైసిపి శ్రేణులు, భవానీలు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం వచ్చినవారందరికీ అల్పాహారం అందజేసారు.

మాజీ ఎంపీ భరత్ ఆధ్వర్యంలో సహస్ర కుంకుమార్చన, పడిపూజ -హాజరైన వైసిపి మాజీ ప్రజాప్రతినిధులు, పురప్రముఖులు.
రాజమహేంద్రవరం, సెప్టెంబరు 29: భవాని మాలధారణలో ఉన్న మాజీ ఎంపీ, వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి స్థానిక విఎల్ పురం మార్గాని ఎస్టేట్స్ లో సహస్ర కుంకుమార్చన, పడిపూజ, భవాని భజన జరిగాయి. భరత్ దంపతులు, కుమార్తెలు అలాగే రాష్ట్ర బిసి సంఘాల జేఏసీ అధ్యక్షుడు మార్గాని నాగేశ్వరరావు దంపతులు పీటలపై కూర్చుని శాస్త్రోక్తంగా కుంకుమార్చన, పడిపూజ నిర్వహించారు. శ్రీ దేవి నవరాత్రుల సందర్బంగా మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, వైసిపి మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు , పురప్రముఖులు,వైసిపి శ్రేణులు, భవానీలు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం వచ్చినవారందరికీ అల్పాహారం అందజేసారు.

