విశాఖపట్నం, మార్చి 8: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్ర గ్రంథాలయం, విశాఖపట్నంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు వన్నెం రెడ్డి సతీష్ కుమార్, కార్యదర్శి బుర్రి కుమార్ రాజు పాల్గొన్నారు. సామాజిక కార్యకర్త కె. రమప్రభ, ఉపాధ్యాయురాలు సంధ్యారాణి మహిళల సమస్యలపై ప్రసంగించారు. 50 సంవత్సరాలుగా గ్రంథాలయానికి వస్తున్న చిట్టి నారాయణమ్మను సన్మానించారు.


