ఖమ్మం ఫిబ్రవరి
(పున్నమి జిల్లా ఇంచార్జి)
ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం లో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి వారిని తెలంగాణ ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క సతీసమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు.
ఈ సం దర్భము గా భట్టి విక్రమార్క మాట్లాడు తు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మహా శివ రాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ న్నాను అని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది సుభిక్షంగా ఉండాలని, ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలని పరమశివుడిని ప్రార్థించినట్లు తెలిపారు. 2047 నాటికి తెలంగాణను ప్రపంచ స్థాయిలో 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా శివాలయాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులు కి సూచించారు



