నకిరేకల్ :ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి )
తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం 79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నకిరేకల్ లోని
మహనీయుల విగ్రహాలున్న బస్టాండ్ దగ్గరలోని
బి. ఆర్. అంబేద్కర్, గాంధీల విగ్రహాలను శుభ్రం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంటిపైనా జాతీయజెండాను ఎగురావేయాలని పిలుపునిచ్చారు.
ఈకార్యక్రమంలో నకిరేకల్ పట్టణ బి. జె. పి. అధ్యక్షులు గర్రె మురళీమోహన్ గారు, జిల్లా కౌన్సిల్ సభ్యులు జానీ గారు, పందాల సైదులు గౌడ్, భువనగిరి వెంకటేశ్వర్లు, చందుపట్ల వేణుమాధవ్, కారింగుల యాదగిరి రాజయోగి తదితరులు పాల్గొని కార్యక్రమంను విజయవంతం
చేశారు.


