అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు వాయు లింగేశ్వరపురం. ఆ ఊరిలో మహేశ్వరి, దేవా అనే దంపతులు ఉండేవారు. వీరికి పెళ్లి అయ్యి చాలా సంవత్సరాలు అయ్యింది. అయినా వీళ్ళకు పిల్లలు లేరు. అందుకు వీరు చాలా బాధపడుతూ ఉండేవారు. ఒకరోజు ఒక ఋషి ఆ ఊరికి వచ్చి, అక్కడ ఉన్న శివాలయంలో ఉన్న శివుని దర్శనం చేసుకుని,ఆ దంపతులు ఇద్దరూ ఉన్న ప్రదేశం గుండా అతను వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఆ ఋషి వచ్చి ఆ దంపతులతో ఇలా చెప్పాడు ” తల్లీ నీవు సంతానం లేకుండా చాలా బాధపడుతున్నావు కదా ” అని ఆ ఋషి వాళ్లను అడిగాడు. మహేశ్వరి ” అవును! మీకు ఎలా తెలుసు” అని అడిగింది. ఋషి ” అంతా ఆ మహాదేవుని మహిమ” అని చెప్పాడు. తరువాత ఆ ఋషి మహేశ్వరి తో ఇలా చెప్పాడు ” తల్లి నీవు ఈ క్షణం నుంచి మహాదేవుడిని పూజించు, అతనికి భక్తి శ్రద్ధలతో శ్రమించుకో ఇలా నువ్వు చేయడం ద్వారా నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది” అని ఆ ఋషి చెప్పాడు. అప్పుడు తన భర్త దేవాతో ఈ విషయాన్ని గురించి చెప్పింది. అలా రోజు ఇద్దరూ కలిసి వారికి దగ్గరలో ఉన్న శివాలయంనందుకు వెళ్లి రోజు పూజలు చేసి, అభిషేకం చేసి, నైవేద్యం సమర్పించి, చాలా నిష్టగా, భక్తి శ్రద్ధలతో మహా దేవుడిని పూజించారు. ప్రతి సోమవారం వారు ఇద్దరూ సాయంత్రం సమయంలో దీపం వెలిగించి,ఆ రాత్రి అక్కడే ఉండి జాగారం చేసి, తెల్లవారి జామున లేచి, అక్కడే ఉన్న కోనేరు లో స్నానం చేసి, మహాదేవుడిని దర్శించుకుని వారి ఇంటికి వెళ్లారు. తరువాత కొన్ని రోజులకి మహేశ్వరి తన పుట్టింటికి వెళ్ళింది. అప్పుడు తన వెళ్ళిన రెండో రోజు తను తల్లి కాబోతుంది అని తెలిసింది. ఈ విషయాన్ని తన భర్తతో చెప్పింది మహేశ్వరి. మహేశ్వరి మరియు తన భర్త దేవా ఇద్దరూ కలిసి గుడికి వెళ్లి మహాదేవునికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఆరోజు మొత్తం వారు ఇద్దరు గుడిలో ఉండి అన్నదానం కార్యక్రమం చేసి, రాత్రి జాగారం చేశారు. కొన్ని నెలల తరువాత మహేశ్వరి శ్రీమంతం చేసుకుంది. అలా అందరూ సంతోషంగా ప్రశాంతంగా ఉన్నారు. హఠాత్తుగా ఒక రోజు మహేశ్వరి తన భర్త అయినా దేవాతో కలిసి మందుల కోసం పట్నం వెళ్ళారు. అప్పుడు దేవా రోడ్డును దాటబోతు ఉండగా ఒక లారీ వచ్చి అతనిని ఢీ కొట్టింది. అప్పుడు అతనిని వైద్యశాలకు తరలించారు. దేవా తన ప్రాణాలను కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న మహేశ్వరి వెంటనే స్పృహ కోల్పోయింది. వెంటనే మహేశ్వరిని అదే వైద్యశాలలో చేర్పించారు. అప్పుడు తన స్థితి చాలా ప్రమాదకరమైనదిగా ఉంది. అని వైద్యులు చెప్పారు. తన కడుపులో ఉన్న బిడ్డకు చాలా ప్రమాదం ఉందని చెప్పారు.

మహాదేవి ( విభాగం -1)
అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు వాయు లింగేశ్వరపురం. ఆ ఊరిలో మహేశ్వరి, దేవా అనే దంపతులు ఉండేవారు. వీరికి పెళ్లి అయ్యి చాలా సంవత్సరాలు అయ్యింది. అయినా వీళ్ళకు పిల్లలు లేరు. అందుకు వీరు చాలా బాధపడుతూ ఉండేవారు. ఒకరోజు ఒక ఋషి ఆ ఊరికి వచ్చి, అక్కడ ఉన్న శివాలయంలో ఉన్న శివుని దర్శనం చేసుకుని,ఆ దంపతులు ఇద్దరూ ఉన్న ప్రదేశం గుండా అతను వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఆ ఋషి వచ్చి ఆ దంపతులతో ఇలా చెప్పాడు ” తల్లీ నీవు సంతానం లేకుండా చాలా బాధపడుతున్నావు కదా ” అని ఆ ఋషి వాళ్లను అడిగాడు. మహేశ్వరి ” అవును! మీకు ఎలా తెలుసు” అని అడిగింది. ఋషి ” అంతా ఆ మహాదేవుని మహిమ” అని చెప్పాడు. తరువాత ఆ ఋషి మహేశ్వరి తో ఇలా చెప్పాడు ” తల్లి నీవు ఈ క్షణం నుంచి మహాదేవుడిని పూజించు, అతనికి భక్తి శ్రద్ధలతో శ్రమించుకో ఇలా నువ్వు చేయడం ద్వారా నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది” అని ఆ ఋషి చెప్పాడు. అప్పుడు తన భర్త దేవాతో ఈ విషయాన్ని గురించి చెప్పింది. అలా రోజు ఇద్దరూ కలిసి వారికి దగ్గరలో ఉన్న శివాలయంనందుకు వెళ్లి రోజు పూజలు చేసి, అభిషేకం చేసి, నైవేద్యం సమర్పించి, చాలా నిష్టగా, భక్తి శ్రద్ధలతో మహా దేవుడిని పూజించారు. ప్రతి సోమవారం వారు ఇద్దరూ సాయంత్రం సమయంలో దీపం వెలిగించి,ఆ రాత్రి అక్కడే ఉండి జాగారం చేసి, తెల్లవారి జామున లేచి, అక్కడే ఉన్న కోనేరు లో స్నానం చేసి, మహాదేవుడిని దర్శించుకుని వారి ఇంటికి వెళ్లారు. తరువాత కొన్ని రోజులకి మహేశ్వరి తన పుట్టింటికి వెళ్ళింది. అప్పుడు తన వెళ్ళిన రెండో రోజు తను తల్లి కాబోతుంది అని తెలిసింది. ఈ విషయాన్ని తన భర్తతో చెప్పింది మహేశ్వరి. మహేశ్వరి మరియు తన భర్త దేవా ఇద్దరూ కలిసి గుడికి వెళ్లి మహాదేవునికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఆరోజు మొత్తం వారు ఇద్దరు గుడిలో ఉండి అన్నదానం కార్యక్రమం చేసి, రాత్రి జాగారం చేశారు. కొన్ని నెలల తరువాత మహేశ్వరి శ్రీమంతం చేసుకుంది. అలా అందరూ సంతోషంగా ప్రశాంతంగా ఉన్నారు. హఠాత్తుగా ఒక రోజు మహేశ్వరి తన భర్త అయినా దేవాతో కలిసి మందుల కోసం పట్నం వెళ్ళారు. అప్పుడు దేవా రోడ్డును దాటబోతు ఉండగా ఒక లారీ వచ్చి అతనిని ఢీ కొట్టింది. అప్పుడు అతనిని వైద్యశాలకు తరలించారు. దేవా తన ప్రాణాలను కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న మహేశ్వరి వెంటనే స్పృహ కోల్పోయింది. వెంటనే మహేశ్వరిని అదే వైద్యశాలలో చేర్పించారు. అప్పుడు తన స్థితి చాలా ప్రమాదకరమైనదిగా ఉంది. అని వైద్యులు చెప్పారు. తన కడుపులో ఉన్న బిడ్డకు చాలా ప్రమాదం ఉందని చెప్పారు.

