ఎస్ పి ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిహారానికి సంబంధించి సామాజిక తనిఖీ బహిరంగ ప్రజావేదికను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఎండిఓ జలజాక్షి మేడం ,పి డి గంగాభవాని మేడం ,డి వి ఓ విజయలక్ష్మి మేడం, జె క్యు సి ఖలీల్ సార్, ఏ పి డి గాయత్రీ దేవి మేడం, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పనుల అమలు, ఖర్చుల వివరాలు, పరిహార చెల్లింపులపై పారదర్శకంగా చర్చించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సూచనలను నమోదు చేసి, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ సామాజిక తనిఖీ ద్వారా పథకం అమలులో జవాబుదారీతనం మరింత పెరుగుతుందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ బహిరంగ ప్రజావేదిక .
ఎస్ పి ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిహారానికి సంబంధించి సామాజిక తనిఖీ బహిరంగ ప్రజావేదికను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఎండిఓ జలజాక్షి మేడం ,పి డి గంగాభవాని మేడం ,డి వి ఓ విజయలక్ష్మి మేడం, జె క్యు సి ఖలీల్ సార్, ఏ పి డి గాయత్రీ దేవి మేడం, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పనుల అమలు, ఖర్చుల వివరాలు, పరిహార చెల్లింపులపై పారదర్శకంగా చర్చించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సూచనలను నమోదు చేసి, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ సామాజిక తనిఖీ ద్వారా పథకం అమలులో జవాబుదారీతనం మరింత పెరుగుతుందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.

