శ్రీ కాళహస్తి, జనవరి 31, పున్నమి న్యూస్: స్వాతంత్ర సమరయోధులు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా శ్రీ కాళహస్తి జనసేన పార్టీ నాయకులు పేట బ్రదర్స్ తమ మిత్ర బృందంతో కలసి స్థానిక మండల కార్యలంలోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. ఈ సందర్బంగా జనసైనికులు మాట్లాడుతూ.. బాపూజీ భారతదేశ స్వాతంత్రం కోసం ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసి, సత్యం, అహింస, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం, అంటరానితనం, అనేక సిద్ధాంతాల మీద పోరాటం చేసి, బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి చేసి మన భారతదేశ స్వాతంత్రం కోసం ఎంతో కృషి చేసి గొప్ప చరిత్ర కలిగినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీజి అని ప్రతి ఒక్కరు న్యాయమార్గంలో నడిచే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, మనీ, ప్రదీప్ కుమార్, నవీన్, హరి, చందు, జానీ, రాజా, భాను, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు

మహాత్మా గాంధీకి నివాళులర్పించిన జనసైనికులు
శ్రీ కాళహస్తి, జనవరి 31, పున్నమి న్యూస్: స్వాతంత్ర సమరయోధులు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా శ్రీ కాళహస్తి జనసేన పార్టీ నాయకులు పేట బ్రదర్స్ తమ మిత్ర బృందంతో కలసి స్థానిక మండల కార్యలంలోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. ఈ సందర్బంగా జనసైనికులు మాట్లాడుతూ.. బాపూజీ భారతదేశ స్వాతంత్రం కోసం ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసి, సత్యం, అహింస, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం, అంటరానితనం, అనేక సిద్ధాంతాల మీద పోరాటం చేసి, బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి చేసి మన భారతదేశ స్వాతంత్రం కోసం ఎంతో కృషి చేసి గొప్ప చరిత్ర కలిగినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీజి అని ప్రతి ఒక్కరు న్యాయమార్గంలో నడిచే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, మనీ, ప్రదీప్ కుమార్, నవీన్, హరి, చందు, జానీ, రాజా, భాను, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు

