క్రీడా పాఠశాలలో ప్రవేశానికి 9 క్రీడ అంశాలపై నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొన్న వారిలో మహబూబాబాద్ జిల్లా నుండి మొత్తం 20 మంది ఎంపిక అయ్యారు.వారిలో పది మంది బాలురు 10 మంది బాలికలు ఎంపిక అవ్వడం జరిగింది.రాష్ట్రస్థాయి ఎంపిక అయినట్లు డి వై ఎస్ ఓ అధికారిని ఓలేటి జ్యోతి గారు తెలిపారు. ఎంపిక అయిన బాలబాలికలు ఈనెల ఏప్రిల్ 27 నుండి హకీంపేట క్రీడా ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్రం నుండి అన్ని జిల్లాల విద్యార్థులు హకీంపేట క్రీడా వేదికగా పాల్గొంటారు అని తెలిపారు అలాగే జిల్లా నుండి ఎంపికైన బాల బాలికలకు వారిని శుభాకాంక్షలు తెలిపారు.
ఎంపికైన బాలుర వివరాలు: హేమంత్, వరుణ్ ,అరుష్ ,వివేక్ ,ఎండి అతిక్ హుస్సేన్, కుశాల్ లక్ష్మి సాగర్, అతిరథ తారక రామ్, శౌర్యానంద, వేమన ఆదిత్య ఉన్నారు .
అలాగే బాలికల విభాగంలో: జశ్విత కృష్ణ, అనన్య, తహస్య, రిషిత ప్రియ, తేజస్విని ,మేఘన ,భూక్య తన్విక, వీక్షశ్రీ ,లాస్య, శాన్వి శ్రీలు ఉన్నారు

