మరో కొత్త ఆలోచనతో పోస్టల్ సేవలు
రైల్వేకోడూరు న్యూస్
ఇటీవల కాలంలో రైల్వే కోడూరు మండలం రెడ్డివారిపల్లి పోస్ట్ ఆఫీస్ నుండి మెరుగైన సేవలను అందించిన కారణంగా రెడ్డివారిపల్లి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ని అభినందిస్తున్న పోస్టల్ సూపర్డెంట్ రాజేష్ మరియు రాజంపేట సబ్ డివిషన్ ఇన్స్పెక్టర్ వెంకట ప్రసాద్
ఈ సందర్భంగా రెడ్డివారిపల్లి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ చెన్నయ్య మాట్లాడుతూ..నా సేవలను గౌరవించి నాకు ఈ ప్రశంసలు అందించిన సూపర్డెంట్ ఆఫ్ పోస్ట్ రాజేష్ కి సబ్ డివిజనల్ హెడ్ వెంకట ప్రసాద్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను, అదేవిధంగా పోస్టల్ సేవలను ప్రజలు అన్ని విధాల వినియోగించుకోవాలని, తపాలా సేవలను ప్రజలకు చేరువ అయ్యే విధంగా సాయి శక్తుల శ్రమిస్తున్నామన్నారు. ప్రజలకు పోస్ట్ ఆఫీస్ సేవల పట్ల అవగాహన సభలు, క్యాంపెయింగ్ ల రూపంలో నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా రెడ్డివారి పల్లి గ్రామ పెద్దలకి వారు ఒక ప్రత్యేక సందేశాన్ని అందించారు. అదేమిటంటే ప్రజల పట్ల సేవా భావంతో పనిచేస్తున్న ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారు వారి గ్రామంలోని పేద బడుగు బలహీన వర్గ ప్రజల కు చేదోడుగా ఉంటూ పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలను ప్రారంభించుటకు మొదటి సహకారం అందించాలని వారు విన్నపించుకున్నారు. తపాలా సేవలలో పప్రదమైనదిగా సుకన్య సమృద్ధి యోజన పథకం అందుబాటులో ఉన్నది మీ గ్రామంలోని 10 సంవత్సరాల లోపు ఉన్న బాలికలు ఈ పథకానికి అర్హులు కావున మీ గ్రామంలోని అర్హులైన బాలికలందరికీ 250 రూపాయలు మొదటి డిపాజిట్ స్పాన్సర్ చేసి వారి ఉజ్వల భవిష్యత్తుకు మార్గదర్శకులు మీరు కాగలరన్నారు. మా ఈ విన్నపాన్ని స్వీకరించి మీ గ్రామ ప్రజలకు భరోసాగా నిలుస్తారని ఆశిస్తున్నామన్నారు.


