ఆగస్టు 14 పున్నమి ప్రతినిధి : ఆగస్టు 15 నుండి కేవలం కొత్త పింఛన్ గ్రీవెన్స్ కోసం మన మిత్ర యాప్లో ప్రత్యేక సదుపాయం ప్రారంభం కానుంది. గ్రామీణ పెదరిక నిర్మూలన సొసైటీ (SERP) అధికారులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కొత్త పింఛన్ దరఖాస్తుదారులకు అర్హత, పత్రాల లోపాలు, పేరు సవరణలు, రికార్డు లోపాలు వంటి సమస్యలు ఎదురైనప్పుడు ఇకపై ప్రత్యక్షంగా కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, మొబైల్లోనే మన మిత్ర యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
ఎలా నమోదు చేయాలి?
మన మిత్ర యాప్లోకి లాగిన్ అయ్యి, “New Pension Grievance” సెక్షన్ను ఎంచుకోవాలి. సమస్యకు సంబంధించిన కేటగిరీని ఎంపిక చేసి, అవసరమైన వివరాలు, పత్రాలు అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. సంబంధిత అధికారి ఆ ఫిర్యాదును స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. యాప్లోనే స్టేటస్ను ట్రాక్ చేసే సౌకర్యం కూడా ఉంటుంది.
ప్రయోజనాలు
కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.
కొత్త పింఛన్ సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి.
ప్రభుత్వ ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుంది.


