


మనుబోలు (పున్నమి విలేకరి)11,ఫిబ్రవరి :మనుబోలు మండలంలో గురువారం రెండో రోజు నామినేషన్లు ప్రక్రియ జోరుగా సాగింది మండలం లోని కట్టువవల్లిలో వైకాపా బలపరచిన అభ్యర్థి ఎస్ భారతమ్మ నామినేషన్ ను గుండాల ఆదినారాయణ జానకిరెడ్డి ఆధ్వర్యంలో నామినేషన్ వేశారు. అదేవిధంగా కొలనుకుదురు టీడీపీ బలపరచిన అభ్యర్థి కసిరెడ్డి సునీల్ రెడ్డి నామినేషన్ వేశారు. అక్కంపేట వైకాపా బలపరచిన ఆభ్యర్ధి జాంబవతమ్మ కిరణ్ రెడ్డి ఆధ్వర్యంలో నామినేషన్ దాఖలు చేశారు. వీరంపల్లిలో వైకాపా బలపరచిన అభ్యర్థి సుధాకర్ జెట్టి సురేంద్ర ఆధ్వర్యంలో నామినేషన్ వేశారు.కొమ్మలపూడి లో రఘరామయ్య టీడీపీ బలపరచిన అభ్యర్థి గా శేషురెడ్డి ఆధ్వర్యంలో నామినేషన్ దాఖలు చేశారు. మానిటెరింగ్ అధీకారి సమాచారం మేరకు మూడుగంటల సమయానికి 30సర్పంచ్ అభ్యర్థులు. 172 వార్డుమెంబర్లకు నామినేషన్ లు దాఖలయ్యాయి. ఇదిలా వుండగా జట్లకొండూరు నామినేషన్ కేంద్రాన్ని ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ తనిఖీ చేసి ఆర్వోలకు పలుసూచనలు సలహాలు చేశారు. ఎస్ఐ ముత్యాలరావు ఆధ్వర్యంలో గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. తహసీల్దార్ నాగరాజు ఆర్డీవో తోపాటు వున్నారు.

