ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చ్( పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం మడమనూరు, అక్కంపేట, వీరంపల్లి గ్రామాలలో ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, సమాజ శాంతి, సౌభ్రాతృత్వం కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మత గురువులు, పెద్దలు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామాలలో పండుగ వాతావరణం నెలకొని ఆనందం వెల్లివిరిసింది.

మనుబోలు మండలంలో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహణ
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చ్( పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం మడమనూరు, అక్కంపేట, వీరంపల్లి గ్రామాలలో ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, సమాజ శాంతి, సౌభ్రాతృత్వం కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మత గురువులు, పెద్దలు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామాలలో పండుగ వాతావరణం నెలకొని ఆనందం వెల్లివిరిసింది.

