Sunday, 7 December 2025
  • Home  
  • మధ్యాహ్న భోజన పథకం బకాయిలు, వేతనాలు వెంటనే చెల్లించాలి.
- Featured

మధ్యాహ్న భోజన పథకం బకాయిలు, వేతనాలు వెంటనే చెల్లించాలి.

05-06-2020 బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికుల బిల్లులు బకాయిలు, వేతనాలు బకాయిలు వెంటనే చెల్లించాలని సిఐటియు మండల కార్యదర్శి చల్ల కొలుసు మల్లికార్జున డిమాండ్ చేశారు. శుక్రవారం మండల విద్యాశాఖ అధికారి కి కార్మికుల డిమాండ్లపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికుల జనవరి నెల నుండి బిల్లులు, వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. జనవరి 21వ తేదీ నుండి ప్రభుత్వం ఛార్జీలను పెంచడం జరిగిందని ఆ బకాయిలు కూడా చెల్లించలేదు అన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో మెను మార్పులు చేసింది కానీ పెరిగిన మెనూ ఛార్జీలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచలేదు అన్నారు. వేరుశనగ ముద్దులు జనవరి 21 నుండి విద్యార్థులకు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. అప్పటి నుండి కార్మికులు విద్యార్థులకు చిక్కులను ఇస్తున్నారు. ఇప్పటికీ కూడా చిక్కిలకి సంబంధించి డబ్బులు చెల్లించలేదు. కరోనా మహమ్మారి వ్యాప్తిలో కూడా విద్యార్థులకు రైస్, కోడి గుడ్లు తో పాటుగా చిక్కీలు ఇవ్వాలనే ఆఉద్దేశంతో భోజనం కార్మికులు అప్పులు చేసి మరీ చిక్కిలను పెడుతున్నారు. లాక్ డౌన్ కారణంగా కుటుంబాలు పనులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే భోజన కార్మికుల వేతన బిల్లులు బకాయిలను వెంటనే చెల్లించాలి. లాక్ డౌన్ లో ఏప్రిల్ నుండి ఇ జూన్ వరకు వేతనాలు చెల్లించాలి. గ్రామీణ ఉపాధి హామీ పథకం లో భోజనం కార్మికులకు జాబ్ కార్డులు ఇవ్వాలి. ప్రైవేటు సంస్థల అకౌంట్ లో పడిన బిల్లులు, వేతనాలను వెంటనే కార్మికులకు చెల్లించాలి. కార్మికులందరికీ ఇండ్ల స్థలాలు, పక్కా ఇల్లు ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో మండల సిఐటియు కార్యదర్శి మల్లికార్జున మరియు మధ్యాహ్న భోజన పథక కార్మికులు ఇతరులు పాల్గొన్నారు.

05-06-2020 బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికుల బిల్లులు బకాయిలు, వేతనాలు బకాయిలు వెంటనే చెల్లించాలని సిఐటియు మండల కార్యదర్శి చల్ల కొలుసు మల్లికార్జున డిమాండ్ చేశారు. శుక్రవారం మండల విద్యాశాఖ అధికారి కి కార్మికుల డిమాండ్లపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికుల జనవరి నెల నుండి బిల్లులు, వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. జనవరి 21వ తేదీ నుండి ప్రభుత్వం ఛార్జీలను పెంచడం జరిగిందని ఆ బకాయిలు కూడా చెల్లించలేదు అన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో మెను మార్పులు చేసింది కానీ పెరిగిన మెనూ ఛార్జీలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచలేదు అన్నారు. వేరుశనగ ముద్దులు జనవరి 21 నుండి విద్యార్థులకు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. అప్పటి నుండి కార్మికులు విద్యార్థులకు చిక్కులను ఇస్తున్నారు. ఇప్పటికీ కూడా చిక్కిలకి సంబంధించి డబ్బులు చెల్లించలేదు. కరోనా మహమ్మారి వ్యాప్తిలో కూడా విద్యార్థులకు రైస్, కోడి గుడ్లు తో పాటుగా చిక్కీలు ఇవ్వాలనే ఆఉద్దేశంతో భోజనం కార్మికులు అప్పులు చేసి మరీ చిక్కిలను పెడుతున్నారు. లాక్ డౌన్ కారణంగా కుటుంబాలు పనులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే భోజన కార్మికుల వేతన బిల్లులు బకాయిలను వెంటనే చెల్లించాలి. లాక్ డౌన్ లో ఏప్రిల్ నుండి ఇ జూన్ వరకు వేతనాలు చెల్లించాలి. గ్రామీణ ఉపాధి హామీ పథకం లో భోజనం కార్మికులకు జాబ్ కార్డులు ఇవ్వాలి. ప్రైవేటు సంస్థల అకౌంట్ లో పడిన బిల్లులు, వేతనాలను వెంటనే కార్మికులకు చెల్లించాలి. కార్మికులందరికీ ఇండ్ల స్థలాలు, పక్కా ఇల్లు ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో మండల సిఐటియు కార్యదర్శి మల్లికార్జున మరియు మధ్యాహ్న భోజన పథక కార్మికులు ఇతరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.