సెప్టెంబరు చేజర్ల (పున్నమి ప్రతినిధి)
స్వస్థనారి – స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమములో భాగంగా చేజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మడపల్లి గ్రామంలో ప్రత్యేకంగా మహిళల ఆరోగ్యం గురించి బీపీ, షుగరు, క్యాన్సర్, రక్తహీనత, టిబి, లెప్రసీ, వంటి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో డాక్టర్ మెహతాబ్ మాట్లాడుతూ, మండలంలోని ప్రజలందరూ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని వినియోగించుకోవాలని ప్రభుత్వాసుపత్రిలో మంచి వసతులతో కూడిన వైద్యం అందుతుందని మంచి డాక్టర్లు అందుబాటులో ఉన్నారని ఆమె తెలియజేశారు.ఈ కార్యక్రమములో డా|| షేక్ మెహతాబ్, సి.హెచ్.ఓ యం. వెంగయ్య, పీహెచ్ ఎన్, హెచ్ వి, ఎం పి హెచ్ ఎ లు , ఎం ఎల్ హెచ్ పి లు, ప్రజలు మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.


