— పున్నమి ప్రతినిధి
మంగళవారం నుంచి మూడు రోజులపాటు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం బయల్దేరి సాయంత్రం 4 గంటలకు ఆయన పులివెందుల చేరుకుంటారు. అనంతరం భాకరాపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. ఈ పర్యటనలో భాగంగా “ప్రజా దర్బార్” నిర్వహించి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోనున్నారు.


