నిర్మల్ జిల్లా , సెప్టెంబర్, (పున్నమి ప్రతినిధి)
భైంసా పట్టణంలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గట్టు మైసమ్మ ఆలయంలో పూజా–ఆరతి కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పశువైద్య రిటైర్డ్ అధికారి, రాష్ట్ర ఎనిమల్ హజ్ బెండ్రీ డైరెక్టర్ డాక్టర్ పోశెట్టి, డాక్టర్ నాగేశ్, ఆలయ కమిటీ పెద్దలు గట్టు, మహేష్, పోషట్టీ, స్వామి, జగదీష్, కోర్వసచిన తదితరులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఉత్సాహభరితంగా పాల్గొని ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. ఈ ఉత్సవం స్థానికంగా భక్తుల మరియు కమ్యూనిటీ కోసం సాంప్రదాయానుసారంగా ఘనంగా జరిగింది.


