భూములు రీసర్వే చేసి అనంత రాజుపేట ప్రజల సమస్యలు తీర్చండి.
ఎమ్మార్వో కే అమర్నాథ్ ను కోరిన బండారు మల్లికార్జున.
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు అక్టోబర్ 27 (పున్నమి న్యూస్ పత్రినిధి)
రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేట ఎంపీటీసీ బండారు మల్లికార్జున తాసిల్దార్ కే అమర్నాథ్ ను కలిసి అనంతరాజుపేట గ్రామపంచాయతీ లోని పలు ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలపై వినతి పత్ర రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా అనంతరాజుపేట గ్రామపంచాయతీలు భూములు ఆన్లైన్ కాక రైతులకు పాస్బుక్కులు అందక, మరి కొంతమందికి డాక్యుమెంట్లు ఉన్న భూమి అనుభవంలో లేక, అనుభవంలో భూమి ఉన్న ఆన్లైన్ కాకపోవడం వలన పాసుబుక్కులు అందక సన్న కారు రైతులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. అన్ని విషయాలు పరిశీలించి ప్రస్తుతం జరుగుతున్న రీసర్వేలు అనంతరాజుపేట గ్రామంలో రి సర్వే చేసి భూములకు హద్దులు చూపించి, పాసు బుక్కులు. మంజూరు చేసి ఆన్లైన్లో పొందుపరచాలని ఎమ్మార్వో కే అమర్నాథను బండారు మల్లికార్జున విన్నవించుకున్నారు


