పున్నమి ప్రతి నిధి
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ బీజేపీ అధ్యక్షుడు భూక్యా విజయ్పై 18వ తేదీన జరిగిన దాడి ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆదివారం నాడు బీజేపీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి రక్ష హాస్పిటల్లో ఆయనను పరామర్శించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని ధైర్యం చెప్పిన ఆయన, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ కోశాధికారి దేవకీ వాసుదేవరావు జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, నంబూరి రామాలింగేశ్వరరావ్, గుత్త వెంకటేశ్వర్లు, ఈవి రమేష్ రుద్ర ప్రదీప్, విజయ్ రాజు బీజేపీ నాయకులు ఆయనతో కలిసి ఉన్నారు.


