భుజంగేశ్వర స్వామి దేవస్థానం నూతన చైర్మన్ గా ఉంగరాల సురేంద్ర కుమార్
రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి
రైల్వేకోడూరు లోని అతి పురాతన భువనేశ్వరీ దేవి సమేత శ్రీ భుజంగేశ్వర స్వామి వారి దేవస్థానం స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సర కార్తీక మాస ఉత్సవములు సందర్భంగా చైర్మన్ గా ఉంగరాల సురేంద్ర కుమార్ మరియు పాలకవర్గం , సిబ్బంది, అర్చకులు పవన్ స్వామి, ధూర్జటి యోగేశ్వర శర్మ ఆధ్వర్యంలో కార్తీక మాస ఉత్సవాలు రంగ రంగ వైభవంగా జరిగినవి. అందులో భాగంగా ఈరోజు మొదటి కార్తీక సోమవారం శుభ సందర్భంగా భక్తులు శ్రీ స్వామి అమ్మవార్లను విశేషంగా దర్శించుకుని కార్తీక దీపాలను వెలిగించి , తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అంతేకాకుండా
27-10-2025 బుధవారం
నుండి 20-11-2025 వ తేది గురువారము వరకు విశేషమైనటువంటి ఈ కార్తీకమాసంలో భక్తులందరూ పాల్గొనీ స్వామి వారి యొక్క కృపకు పాత్రులు అవుతారని కోరుకుంటూ ఉంగరాల సురేంద్ర ఆలయ కమిటీ చైర్మన్ మరియు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారికి అమ్మవారికి కార్తీకదీపం వెలిగించి వారి కోరికలను కోరుకొన్నారు.


