పలమనేరు, జులై 22,2020 (పున్నమి విలేకరి): భార్య చేతిలో భర్త దారుణ హత్య ఘటన పలమనేరు రూరల్ మండలం నక్కపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి పలమనేరు రూరల్ మండలం నక్కపల్లి చెందిన గోపినాథ్ రెడ్డి, సునీత దంపతులు. వారికి పదమూడేళ్ల క్రితం వివాహం కాగా వారికి పదేళ్ల కొడుకు ఉన్నాడు.గోపీనాథ్ రెడ్డి బెంగళూరు లో ట్యాక్సీలు ను అద్దె ఇచ్చే వ్యాపారం చేసేవాడు.అయితే కరోనా కారణంతో వ్యాపారం సాగక పోవడంతో రెండు నెలల క్రితం స్వగ్రామం మైన నక్కపల్లి వచ్చి ఉపాధి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.ఈ క్రమంలో వారికి గ్రామంలో ఉన్న మూడు ఎకరాల భూమిని అమ్మడంతో వచ్చిన సొమ్మును భార్య సునీత, అత్త చంద్రమ్మ తీసుకున్నారు.అందుకు సంబంధించిన సొమ్మును అడిగిన ప్రతీసారి భార్య సునీత గోపీనాథ్ రెడ్డితో గొడవపడేది. భార్య సునీత,అత్త చంద్రమ్మ గోపీనాథ్ రెడ్డి తరుపున కుటుంబ సభ్యులు, బంధువులును రనిచ్చే వాళ్లు కాదని సమాచారం.దేనికి తోడు తరచు గోపీనాథ్ రెడ్డితో భార్య సునీత వివాదం జరిగేది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి గొడవ జరుగగా భార్య సునీత, అత్త చంద్రమ్మ ఇద్దురు కలిసి గోపీనాథ్ రెడ్డిని క్రికెట్ బాట్ తో తల,మర్మాగంపై బలంగా కొట్టారు.దింతో గోపీనాథ్ రెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు.స్థానికులు నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతుడు గోపీనాథ్ రెడ్డిని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భార్య చేతిలో భర్త దారుణ హత్య
పలమనేరు, జులై 22,2020 (పున్నమి విలేకరి): భార్య చేతిలో భర్త దారుణ హత్య ఘటన పలమనేరు రూరల్ మండలం నక్కపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి పలమనేరు రూరల్ మండలం నక్కపల్లి చెందిన గోపినాథ్ రెడ్డి, సునీత దంపతులు. వారికి పదమూడేళ్ల క్రితం వివాహం కాగా వారికి పదేళ్ల కొడుకు ఉన్నాడు.గోపీనాథ్ రెడ్డి బెంగళూరు లో ట్యాక్సీలు ను అద్దె ఇచ్చే వ్యాపారం చేసేవాడు.అయితే కరోనా కారణంతో వ్యాపారం సాగక పోవడంతో రెండు నెలల క్రితం స్వగ్రామం మైన నక్కపల్లి వచ్చి ఉపాధి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.ఈ క్రమంలో వారికి గ్రామంలో ఉన్న మూడు ఎకరాల భూమిని అమ్మడంతో వచ్చిన సొమ్మును భార్య సునీత, అత్త చంద్రమ్మ తీసుకున్నారు.అందుకు సంబంధించిన సొమ్మును అడిగిన ప్రతీసారి భార్య సునీత గోపీనాథ్ రెడ్డితో గొడవపడేది. భార్య సునీత,అత్త చంద్రమ్మ గోపీనాథ్ రెడ్డి తరుపున కుటుంబ సభ్యులు, బంధువులును రనిచ్చే వాళ్లు కాదని సమాచారం.దేనికి తోడు తరచు గోపీనాథ్ రెడ్డితో భార్య సునీత వివాదం జరిగేది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి గొడవ జరుగగా భార్య సునీత, అత్త చంద్రమ్మ ఇద్దురు కలిసి గోపీనాథ్ రెడ్డిని క్రికెట్ బాట్ తో తల,మర్మాగంపై బలంగా కొట్టారు.దింతో గోపీనాథ్ రెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు.స్థానికులు నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతుడు గోపీనాథ్ రెడ్డిని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

