బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ప్రకటనలో తెలియజేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో పంటల కోతలు చేయరాదని, కల్లాలలో ఉన్న పంటలు కాపాడుకోవడానికి టార్పాలిన్ పట్టాలతో సిద్ధంగా ఉండాలన్నారు.కూటమి నాయకుల అధికారులు,గ్రామ వార్డు,సచివాలయ ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండాలని,భారీ వర్షాల కారణంగా చెరువులు,నీటి కుంటలకు గండ్లు పడే అవకాశం ఉన్నందున అటువంటి అవకాశం ఉన్న ప్రాంతాలను ప్రజలు,అధికారులు గుర్తించి ముందుగానే ప్రమాదం జరగకుండా రక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే పిలునిచ్చారు.

భారీ వర్షాల పడుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.ఎమ్మెల్యే బొజ్జల
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ప్రకటనలో తెలియజేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో పంటల కోతలు చేయరాదని, కల్లాలలో ఉన్న పంటలు కాపాడుకోవడానికి టార్పాలిన్ పట్టాలతో సిద్ధంగా ఉండాలన్నారు.కూటమి నాయకుల అధికారులు,గ్రామ వార్డు,సచివాలయ ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండాలని,భారీ వర్షాల కారణంగా చెరువులు,నీటి కుంటలకు గండ్లు పడే అవకాశం ఉన్నందున అటువంటి అవకాశం ఉన్న ప్రాంతాలను ప్రజలు,అధికారులు గుర్తించి ముందుగానే ప్రమాదం జరగకుండా రక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే పిలునిచ్చారు.

