నిర్మల్ జిల్లా: ( పున్నమి ప్రతినిధి):- జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రేపు (సోమవారం) నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వర్షాల కారణంగా జిల్లాలోని పలు మండలాల్లో నీటి ముట్టడి, రహదారుల దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తడంతో సంబంధిత శాఖల అధికారులు అవసరమైన సహాయక చర్యలు చేపడుతున్నారని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం వచ్చే సోమవారం యథావిధిగా నిర్వహించబడుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.

భారీ వర్షాల నేపథ్యంలో రేపటి ప్రజావాణి రద్దు
నిర్మల్ జిల్లా: ( పున్నమి ప్రతినిధి):- జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రేపు (సోమవారం) నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వర్షాల కారణంగా జిల్లాలోని పలు మండలాల్లో నీటి ముట్టడి, రహదారుల దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తడంతో సంబంధిత శాఖల అధికారులు అవసరమైన సహాయక చర్యలు చేపడుతున్నారని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం వచ్చే సోమవారం యథావిధిగా నిర్వహించబడుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.

