భారీ వర్షాల కారణంగా అనంతసాగరం మండల లోనీ ముస్తాపురం, పాతాళపల్లి గోవిందంపల్లి,
ఉప్పలపాడు,చిలకలమర్రి గ్రామలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ రైతు సంఘం,కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో అనంతసాగరం మండల తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి తమ నిరసన ను రైతులు తెలిపారు.అనంతరం తమ సమస్యను వినతిపత్రం ద్వారా తహసీల్దార్ జయవర్ధన్ గారికి తెలియజేయడం జరిగింది.రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంకయ్య మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా సుమారు వేయి ఎకరాల పంట నష్టం జరిగిందని,చేతికి వచ్చిన వరి పంట, వేరు శనగ పంట పూర్తిగా నీట మునిగినాయని ఈ వర్షాల కారణంగా ఎకరాకు 40 వేల రూపాయలు రైతులు నష్టపోయారని అన్నారు.ప్రభుత్వం వెంటనే రైతులను నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని అన్నారు.ష్టపోయిన రైతుకు ఎకరాకు 50వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.కౌలు రైతు సంఘం రాష్ట్ర కమిటి సభ్యులు గంటా లక్ష్మీపతి మాట్లాడుతూ ఈ భారీ వర్షాల కారణంగా నష్టపోయిన వారిలో కౌలు రైతు ఎక్కువ ఉన్నారని నష్టంపరిహారం చెల్లించపోతే మండలంలో ఉండే రైతులతో కలిసి తహసిల్దార్ కార్యాలయం ముట్టడిస్తామి అన్నారు.భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులు నష్టపరిహారం కోసం రైతులు చేస్తున్న పోరాటానికి సిపిఎం పార్టీ పూర్తి అండగా నిలుస్తున్నది సిపిఎం పార్టీ అనంతసాగరం మండల కార్యదర్శి అన్వర్ బాషా అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు గాడి సుధాకర్,జక్రయ్య,రైతు సంఘం అనంతసాగరం మండల అధ్యక్షుడు నరసింహ రెడ్డి,మండల కార్యదర్శి సత్తార్, వెంకట రాజు,మస్తాన్,
మాలకొండయ్య, మద్దులూరు వెంకటేశ్వర్లు,ప్రసాద్,
సురేష్ , పెంచలయ్య,జయమ్మ,మోహన్ మరియు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.

భారీ వర్షాల కారణంగా నష్ట పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రైతు సంఘం,కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా… అనంతసాగరం అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) .
భారీ వర్షాల కారణంగా అనంతసాగరం మండల లోనీ ముస్తాపురం, పాతాళపల్లి గోవిందంపల్లి, ఉప్పలపాడు,చిలకలమర్రి గ్రామలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ రైతు సంఘం,కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో అనంతసాగరం మండల తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి తమ నిరసన ను రైతులు తెలిపారు.అనంతరం తమ సమస్యను వినతిపత్రం ద్వారా తహసీల్దార్ జయవర్ధన్ గారికి తెలియజేయడం జరిగింది.రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంకయ్య మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా సుమారు వేయి ఎకరాల పంట నష్టం జరిగిందని,చేతికి వచ్చిన వరి పంట, వేరు శనగ పంట పూర్తిగా నీట మునిగినాయని ఈ వర్షాల కారణంగా ఎకరాకు 40 వేల రూపాయలు రైతులు నష్టపోయారని అన్నారు.ప్రభుత్వం వెంటనే రైతులను నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని అన్నారు.ష్టపోయిన రైతుకు ఎకరాకు 50వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.కౌలు రైతు సంఘం రాష్ట్ర కమిటి సభ్యులు గంటా లక్ష్మీపతి మాట్లాడుతూ ఈ భారీ వర్షాల కారణంగా నష్టపోయిన వారిలో కౌలు రైతు ఎక్కువ ఉన్నారని నష్టంపరిహారం చెల్లించపోతే మండలంలో ఉండే రైతులతో కలిసి తహసిల్దార్ కార్యాలయం ముట్టడిస్తామి అన్నారు.భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులు నష్టపరిహారం కోసం రైతులు చేస్తున్న పోరాటానికి సిపిఎం పార్టీ పూర్తి అండగా నిలుస్తున్నది సిపిఎం పార్టీ అనంతసాగరం మండల కార్యదర్శి అన్వర్ బాషా అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు గాడి సుధాకర్,జక్రయ్య,రైతు సంఘం అనంతసాగరం మండల అధ్యక్షుడు నరసింహ రెడ్డి,మండల కార్యదర్శి సత్తార్, వెంకట రాజు,మస్తాన్, మాలకొండయ్య, మద్దులూరు వెంకటేశ్వర్లు,ప్రసాద్, సురేష్ , పెంచలయ్య,జయమ్మ,మోహన్ మరియు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.

